నిజాయితీ చాటుకున్న కానిస్టేబుల్

పట్టణంలోని బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్‌లో ఓ మహిళ తన పర్సును పోగొట్టుకుంది. బంక్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వినోద్‌కు ఆ పర్సు దొరకగా, అందులోని గుర్తింపు కార్డు ఆధారంగా మహిళను పిలిపించి, రూ. 20 వేల నగదుతో సహా పర్సును అప్పగించాడు. కానిస్టేబుల్ వినోద్ నిజాయితీని పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్