కోదాడ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జైలు జీవితం గడిపిన ఉద్యమకారుల సంక్షేమార్థం సూర్యాపేట జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ రావు గుండెపంగు రమేష్ను జిల్లా అధ్యక్షుడిగా నియమించి పత్రం అందజేశారు. రమేష్ మాట్లాడుతూ ఉద్యమకారుల హక్కుల కోసం, అమరుల కుటుంబాల కోసం హామీలు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.