తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సాముల రామిరెడ్డిని టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి ఆదివారం కోదాడలో సన్మానించారు. ఈ సందర్భంగా, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సాముల రామిరెడ్డి దృష్టికి న్యాయవాదుల సమస్యలను లక్ష్మీనారాయణ రెడ్డి తీసుకెళ్లారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సమావేశాల్లో న్యాయవాదుల సమస్యలను చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.