హైదరాబాద్లోని త్యాగరాయ గానసభ ఆడిటోరియంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా యువ ఆర్ట్ థియేటర్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదాడకు చెందిన కేఎల్ఎన్ ప్రసాద్కు ఎన్టీఆర్ సేవా రత్న అవార్డును మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందజేశారు. సినీ నటుడు సుమన్కు జీవిత సాఫల్య అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభాపతి మధుసూదనాచారి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.