కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 11.30 గంటలకు బూరుగడ్డ గ్రామంలో దివ్య సుందర కార్యసిద్ధి హనుమాన్ స్వామి పూజా కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు నారాయణపురంలో రూ. 20 లక్షల టీజీఎంఎస్ఐడీసీ నిధులతో నిర్మించిన పల్లె దవాఖాన భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 12.30 గంటలకు కోదాడలో వివాహ వేడుకలో పాల్గొని, మధ్యాహ్నం 3 గంటలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.