సోషల్ మీడియా ప్రచారాల పట్ల మండల ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం షేర్ చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.