చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ముద్ర నవీన్ (19) అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమయ్యాడు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన అతను, తన మొబైల్ను ఇంట్లోనే వదిలి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదుతో చిలుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసిన వారు 8712686044 నంబర్కు తెలియజేయాలని కోరారు.