హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులకు కౌంటర్ ఇస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోదాడ, నల్గొండ ప్రజల ధైర్యాన్ని, పోరాట పటిమను కొనియాడారు. గతంలో తనను ఆంధ్రాలో అడుగుపెట్టనివ్వబోమని కొందరు హెచ్చరించినప్పుడు ఉమ్మడి నల్గొండ, కోదాడ ప్రాంతాల ప్రజలే తన వెంట ఉండి రక్షణగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ఈ ప్రాంత వాసుల మద్దతును ఆయన ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలు జనసైనికుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.