మునగాల నుండి తెచ్చిన చనిపోయిన గొర్రెకు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య పోస్ట్మార్టం నిర్వహించారు. పరీక్షలో రక్తం పీల్చే పురుగులు ఉన్నట్లు గుర్తించారు. స్వంతంగా మందులు వాడటం వల్లనే ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ముందుగా పేడ పరీక్ష చేయించి, వైద్యుల సూచనలతోనే చికిత్స చేయాలని, తప్పు ఆహారం, మేపే ప్రదేశాలపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.