జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నర్సింహ హెచ్చరించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్ పాడు మండల కేంద్రంలో ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఆయన, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.