కోదాడలో సీపీఎం నియోజకవర్గ స్థాయి బీఎల్ఏల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ములకలపల్లి రాములు పాల్గొన్నారు. ఓటరు జాబితాపై సమగ్ర సవరణ పారదర్శకంగా జరగాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హుల పేర్లు తొలగిస్తే ప్రజలను చైతన్యపరిచి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బెల్లంకొండ వెంకటేశ్వర్లు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, షేక్ సైదా, కోటగిరి వెంకటనారాయణ పాల్గొన్నారు.