విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

శుక్రవారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సమీపంలో విద్యుత్ షాక్‌తో రెడ్డిబోయిన గోపి అనే యువకుడు మృతి చెందాడు. నెమలిపురి గ్రామానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, సమస్యను పరిష్కరించడానికి విద్యుత్ సిబ్బందితో కలిసి స్తంభం ఎక్కిన గోపి ప్రమాదవశాత్తూ విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న గోపి, లైన్‌మెన్ విధుల్లో కూడా సహాయపడుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రులకు ఏకైక కుమారుడైన గోపి మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్