దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ (వైటీపీఎస్)కు శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రానున్నారు. పవర్ ప్లాంట్లోని యూనిట్-1ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దీని ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది. అనంతరం కృష్ణాతీరంలో జెన్కో టౌన్షిప్ కోసం భూమి పూజ చేయనున్నారు.