ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరుకు ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్ఎంలను ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, టీజీఆర్ఎఎస్ లో అమలు చేయనున్నారు. జిల్లాలో 1,528 పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోజుకు 2 సార్లు ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.