పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ నల్లగొండ జిల్లా కోర్టు 21 ఏండ్ల కారాగార శిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. కేసు వివరాలను కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ వెల్లడించారు. నార్కట్ పల్లి మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన వెంకన్న మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించాడు. సీఐ నిందితుడిని అరెస్ట్ చేశారు.