బీఆర్ఎస్ నాయకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన విమర్శలను ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మంగళవారం సూర్యాపేటలో ఖండించారు. హుజూర్నగర్ లో కాంగ్రెస్ కు ప్రజాదరణ ఉందని, అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. అర్థరహిత ఆరోపణలు మానుకోవాలని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.