చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో నార్కట్పల్లి మండలం అక్కేనపల్లికి చెందిన దేవేందర్ రెడ్డి, సరిత అనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. వీరు కారులో మరో నలుగురితో కలిసి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరూ ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.