సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన 12 ప్రాథమిక పాఠశాలల్లో ఈనెల 30, 31 తేదీల్లో మూడవ తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎస్ పరీక్ష నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆదేశించారు. సూర్యాపేట మండలంలో నాలుగు, తిరుమలగిరి, నూతనకల్, గరిడేపల్లి, మునగాల మండలాల్లో ఒక్కో పాఠశాలలో, కోదాడ మండలంలో మూడు పాఠశాలల్లో ఈ పరీక్షను శాంపిల్గా నిర్వహిస్తున్నారు.