లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం: అదనపు కలెక్టర్‌కు వినతి

సూర్యాపేట జిల్లా లైసెన్స్డ్ సర్వేయర్లు సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావుకు వినతిపత్రం అందజేశారు. ఐదు నెలల శిక్షణ అనంతరం ఉత్తీర్ణత సాధించి, లైసెన్సులు పొంది చాలా రోజులు అయినా విధుల్లోకి తీసుకోకపోవడం అన్యాయమని వారు ఆరోపించారు. భూభారతి చట్టం అమలులో భాగంగా లైసెన్స్ సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ వివాదాల పరిష్కారానికి తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగ్గ ఫలితం కావాలని, నెలవారీ గౌరవ వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్