యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయకుంటలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బోడ వెంకటయ్య (50) అనే కిరాణా దుకాణం యజమాని సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు జశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.