పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, విద్యార్థులు నిరాశ చెందవద్దని ఎస్సై చిరంజీవి సూచించారు. ఉత్తీర్ణులైన వారికి అభినందనలు తెలిపి, ఉత్తీర్ణులు కాని వారికి మరో అవకాశం ఉంటుందని, జీవితం విలువైనదని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, విద్యార్థులను నిరంతరం గమనించాలని కోరారు. ఆత్మస్థైర్యంతో సప్లిమెంటరీ పరీక్షల్లో కష్టపడి చదివి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.