పోరాటాల పురిటిగడ్డ అయిన సూర్యాపేట జిల్లా కేంద్రంగా తెలంగాణ సాయుధ పోరాటం సాగిందని, ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును జిల్లాకు పెట్టాలని ఎంసీపీఐ (యూ) జిల్లా నాయకత్వం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించింది. తాగునీటి కాలువను తీసుకొచ్చి రైతుల పొలాలను సస్యశ్యామలం చేసిన గొప్ప మహనీయుడు భీమిరెడ్డి అని నాయకులు కొనియాడారు.