సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2. గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 2:15కి రామోజీ ఫిలింసిటీలోకి చేరి, 3:30 వరకు శ్రీమద్భాగవతం సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. అనంతరం 4 గంటలకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చేరుకుని, 4:15 నుంచి 5:10 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 5:10 నుంచి 5:30 గంటల వరకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు.