సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల సమైక్య కార్యాలయంలో శుక్రవారం సీఈవో సెర్ప్, జిల్లా కలెక్టర్, పీడీ ఆదేశానుసారం తుంగతుర్తి మండల సమైక్య కార్యవర్గ పదాధికారుల ఎన్నిక నిర్వహించారు. దీనికి 27 గ్రామ సంఘాల ఓబి వారు హాజరయ్యారు. అందులో మండల సమైక్య అధ్యక్షురాలుగా గుండగాని జమున ఎన్నికయ్యారు. తూర్పుగూడెం వివో కార్యదర్శిగా సిహెచ్ మమత, అన్నారం వివో టు కోశాధికారిగా ఎం. మల్లిక, సంగెం వివో టు స్వయంకృషి లను ఎన్నుకున్నారు.