యూపీలోని బరేలీ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బరాదరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసించే మహిళా న్యాయవాది మహజబీన్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. డాక్టర్ హషీమ్ అన్సారీ తన కుమార్తె మహజబీన్కు డాక్టర్ తల్హాతో ఫిబ్రవరి 27, 2025న వివాహం జరిపించాడు. అయితే మహజబీన్ భర్త, అత్తమామల వరకట్న వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందని మృతురాలి పేరెంట్స్ ఆరోపించారు. ఈ ఘటనలో మృతురాలి భర్తతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.