టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని పేర్కొన్నారు. ‘ఈ ప్రపంచకప్ ఫైనల్ నా చివరి మ్యాచ్. ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు. నా T20 కెరీర్లో ప్రతీ మూమెంట్ను ఆస్వాదించాను. ప్రపంచకప్ గెలవాలనుకున్నాను. గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను’. అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.