ఉమెన్స్ T20 WCలో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని నెదర్లాండ్స్ ఛేదించలేకపోయింది. 17.3 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. హీథర్ సిగర్స్ (21), ఫీబీ మోల్కెన్బోర్ (15), బాబెట్ డి లీడే(28), స్టెర్రే కాలిస్(18), రోబిన్ రిజ్కే(8), ఫ్రెడ్రిక్ ఓవర్డిజ్క్(9), ఐరిస్ జ్విల్లింగ్(8), సిల్వర్ సీజర్స్(1) పరుగులు చేశారు. భారత్ బౌలర్లు శ్రీచరణి 4, నందిని శర్మ 2, షఫాలీ వర్మ 3, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు.