ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. గాయం కారణంగా పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్లకు జట్టులో చోటు దక్కలేదు. గ్లెన్ మాక్స్వెల్, ఆడమ్ జంపాకు స్థానం లభించింది. మిచ్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జట్టులో మిచ్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానెల్లీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ హేజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమెన్, గ్లెన్ మాక్స్వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు.