ఏప్రిల్ 10 నుంచి ఓటీటీలోకి ‘తాయ్‌ కిళవి’ చిత్రం

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘తాయ్‌ కిళవి’ ఏప్రిల్ 10 నుంచి 'జియో హాట్‌స్టార్' సింప్లీ సౌత్ ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుంది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శివకార్తికేయన్ నిర్మించిన ఈ కామెడీ డ్రామాలో రాధిక 63 ఏళ్ల వయసులో వృద్ధురాలి పాత్రలో నటించారు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్