ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా టెహ్రాన్లో ఉన్న ఓ భారతీయ విద్యార్థి కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ వీడియో విడుదల చేశారు. మిస్సైల్స్ దాడులతో పరిస్థితులు దారుణంగా మారాయని, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక భయాందోళనలో ఉన్నామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా తమను భారత్కు తరలించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.