బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఛైర్మన్గా తారిఖ్ రహ్మాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని ఖలీదా జియా అనారోగ్యంతో మరణించడంతో ఈ పదవి ఖాళీ కావడంతో పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యదర్శి జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లామ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఛైర్మన్గా ఎన్నికైన తర్వాత రహ్మాన్ మాట్లాడుతూ, హసీనా పాలన నాటి పరిస్థితులు ఇక పునరావృతం కాబోవని తెలిపారు.