అహ్మదాబాద్ విమాన ప్రమాదం టాటా గ్రూపు చరిత్రలో ఎన్నడూ జరగని విషాదమని గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఈ ఘటనపై సహచర ఉద్యోగులకు లేఖ రాస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద దర్యాప్తు కోసం భారత్తో పాటు యూఎస్, యూకే నుంచి బృందాలు వచ్చాయని, వాటికి పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతే తమకు ప్రధానం అని, ఈ విషయంలో రాజీ పడే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.