కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో, పర్యావరణ పరిరక్షణతో పాటు సామాన్యుడికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. బయో గ్యాస్ కలిపిన సీఎన్జీపై పన్ను లెక్కింపు పద్ధతిని మార్చుతూ, బయో గ్యాస్ విలువపై ఎలాంటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఉండదని ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సీఎన్జీ ధరలు తగ్గి, కార్లు, ఆటోలు నడిపేవారికి ఖర్చు తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు పెరిగి, రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది.