ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారానికి ఐదు రోజులు ఆఫీసుకు హాజరు కావాలన్న నిబంధనను పాటించని ఉద్యోగుల అప్రైజల్స్ను నిలిపివేసింది. జూలై–సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో అటెండెన్స్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కార్పొరేట్ క్లియరెన్స్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ముఖ్యంగా కొత్తగా చేరిన ఉద్యోగులపై ప్రభావం పడుతోంది. నిబంధనలు పాటించకపోతే FY26 బ్యాండింగ్ సైకిల్ నుంచే తొలగిస్తామని టీసీఎస్ హెచ్చరించింది.