ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. ఐసీసీ చైర్మన్ జై షా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. దీంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఎంతో ఆనందంతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది.