ఇరాన్ దివంగత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఖమేనీతో పాటు కుటుంబసభ్యుల శవపేటికలను రాజధాని టెహ్రాన్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అందులో ఖమేనీ 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మదీ శవపేటిక అందరి మనసులను కలచివేస్తోంది. ఆ చిన్నారి శవపేటిక పక్కనే ఆమె ఫొటోను కూడా ఉంచారు.