ఢిల్లీ నుంచి లండన్కు వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ VS301 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో భద్రత దృష్ట్యా టర్కీలోని ఇస్తాంబుల్లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. చివరికి మరో విమానం ద్వారా ప్రయాణికులను లండన్కు పంపించారు. విమానం సుమారు 12 గంటలు ఆలస్యం అయ్యింది. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించినట్లు ఎయిర్లైన్ తెలిపింది.