మూడేళ్లుగా కరెంటు బిల్లు కట్టని తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌..!

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ పేరు వార్తల్లో నిలుస్తోంది. ఆయన పట్నాలోని ప్రైవేటు ఇంటి కరెంటు బిల్లు గత మూడేళ్లుగా చెల్లించకపోవడంతో, జరిమానాలతో కలిపి రూ.3.6 లక్షలకు చేరింది. మరో కరెంట్ కనెక్షన్‌కు కూడా రూ.3.24 లక్షలు బకాయి ఉన్నట్లు విద్యుత్తు శాఖ డేటా వెల్లడించింది. రూ.25వేల కంటే ఎక్కువ బిల్లు ఉంటే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను డీయాక్టివేట్ చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ, రూ.3 లక్షలకు పైగా బకాయిలున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్