కుంభమేళాకు వెళ్లిన తెలంగాణ బస్సుకు ప్రమాదం.. ఒకరు మృతి (వీడియో)

తెలంగాణ నుండి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్తున్న యాత్రికుల బస్సు మంగళవారం ప్రమాదానికి గురైంది. బస్సు రన్నింగ్ లో ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. బస్సులో దాదాపు 50 మంది యాత్రికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపుచేయడానికి యత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్