TG: మలేషియాలో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల(D) ఎల్లారెడ్డిపేట(M) గొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకట్ రెడ్డి బతుకు తెరువు కోసం మలేషియా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా గుండెపోటుకు గురై వెంకట్ రెడ్డి మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతునికి భార్య వనజ, కూతురు ఉన్నారు.