TG: 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనికోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నామని తెలిపారు. సోమవారం రామోజీ ఫిల్మ్సిటీలో సీఎం మాట్లాడారు. "2035లోపు తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. ఇందులో సినీ రంగానికి ప్రత్యేక చాప్టర్ ఉంటుంది." అని సీఎం రేవంత్ తెలిపారు.