‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్ ప్రజలను కేంద్రంగా చేసుకుని రూపొందించబడిందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్గా ఉండమని కోరినా, తాను వద్దన్నానని, కానీ ముఖ్యమంత్రి లక్ష్యాలు, విజన్ విన్నాక తిరస్కరించలేకపోయానని చెప్పారు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ను దీర్ఘకాలిక లక్ష్యాలతో రూపొందించారని ఆయన ప్రశంసించారు.