దక్షిణాఫ్రికాలోని క్వాజులు నాటల్ ప్రావిన్స్లో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల న్యూ అహోబిలం ఆలయం కూలి 52 ఏళ్ల భారత సంతతి వ్యక్తి, మరో ముగ్గురు మృతిచెందారు. కార్మికులు ఇక్కడ విధుల్లో ఉండగా ఆలయం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద మరింత మంది ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.