గుజరాత్లోని జామ్నగర్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఓ టెంపో అతివేగంగా దూసుకెళ్లి బైక్ను ఢీకొట్టింది. అనంతరం బైక్ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో పాటు ఆటోరిక్షాను సైతం ఆ టెంపో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో బైక్ రైడర్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.