అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో తెందూల్కర్- అండర్సన్ ట్రోఫీ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ట్రోఫీ నామకరణ కార్యక్రమాన్ని మొదట జూన్ 14(శనివారం) లార్డ్స్ వేదికగా నిర్వహించాలనుకున్నారు. అయితే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), బీసీసీఐ సంయుక్త ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడింది. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- భారత్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.