కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్ కాచిగూడలోని కిషన్రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఇవాళ ఉదయం ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్కు తరలించారు.