పాకిస్తాన్లోని లాహోర్లో అమెరికా కాన్సులేట్ వద్ద నిరసనకారులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇరాన్కు మద్దతుగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. వారిని చెదరగొట్టడానికి టీయర్ గ్యాస్ ఉపయోగించారు.