హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంజౌలి ప్రాంతంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలంటూ జనం పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. దేవభూమి సంఘటన్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు, స్థానికులు బుధవారం మసీదు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల కిందట చట్టవ్యతిరేకంగా నిర్మించిన నాలుగంతస్తుల మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు.