ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం పాక్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే.. పరారైన ఉగ్రవాదులు తిరిగి శిబిరాలకు చేరుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ధ్వంసమైన చోటే పాక్ తిరిగి లాంచ్ ప్యాడ్లు, శిక్షణ శిబిరాలు నిర్మిస్తున్నదని వెల్లడించింది. ఈ చర్యలకు ISI, పాక్ సైన్యం, ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.