అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. జూలై 15న ముంబయిలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు సమాచారం. బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఈ షోరూం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 5 వై మోడల్ కార్లు షాంఘై నుంచి ముంబయికి చేరుకున్నాయని తెలుస్తోంది. త్వరలో ఢిల్లీలోనూ మరో షోరూం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.